కుతాటి విజయ్ కుమార్ అనే కార్యకర్త
ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న కార్యకర్తను పరామర్శించిన సతీష్ కుమార్
*కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా..!
కార్యకర్తలు అధైర్య పడొద్దు అండగా ఉంటా సతీష్ కుమార్
పదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేశా
నిస్వార్ధంగా,నిజాయితీగా, నిబద్ధతతో పని చేశా
వివిధ విభాగాల నుండి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి,హుస్నాబాద్ ను ఆదర్శంగా తీర్చిదిద్దా
ప్రజాలిచ్చిన తీర్పును గౌరవిస్తూ, గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన బి అర్ ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్*
సైదాపూర్, 11డిసెంబర్
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
హుస్నాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నేత కేసిఆర్, కెప్టెన్ కేటీఆర్, హరీష్ రావు, అప్పటి పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రోద్బలంతో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.నాటి నుండి నేటి వరకు టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ వరకు ఏ పని అప్పజెప్పినా బాధ్యతాయుతంగా చేశానని అన్నారు. సర్పంచిగా సింగిల్ విండో చైర్మన్గా టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా పోటీ చేయమని చేశానని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడానని తెలిపారు. తెలంగాణ 2009 ఉద్యమ సమయంలో . 2009లో ఆనాటి ఉద్యమ సమయంలో తెలంగాణను సాధించడమే ధ్యేయంగా ఆర్నిశలు కృషి చేసానని, రాస్తారోకోలు, ధర్నాలు, అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.అంతే కాకుండా ఉద్యమ సమయంలో పనిచేసిన ఉద్యమకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు.స్వరాష్ట్రం కోసం రాజీనామా చేసి గెలుపొందానని అన్నారు.నియోజకవర్గం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, 2018లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వస్తే అనేక పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చినప్పటికిని ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశానని అన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారపక్షంలో ఉన్నప్పుడు నాయకులను గౌరవిస్తూ పనులు చేయించడం జరిగిందన్నారు.గుడిసె వాసుల కోసం వామపక్షాలతో కలిసి పోరాడానని తెలిపారు. వారిని పిలిచి గౌరవించి,సన్మానించడం జరిగిందని కూడా అన్నారు. నియోజకవర్గం లో ఉన్నవారికీ అనేక సంక్షేమ ఫలాలు దళిత బంధు, బీసీ బందు, మైనారిటీ బందు ఇవే కాకుండా అనేకమంది లబ్ధిదారులకు చేయూతనిచ్చే విధంగా సంక్షేమ పథకాలను అందించానని తెలిపారు. నగరాభివృద్ధిని చేయడమే ధ్యేయంగా పెట్టుకొని,నిస్వార్ధంగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశానన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని,మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్ గౌడ్ , నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల హయాంలో వివిధ విభాగాల నుండి అనేక నిధులను తీసుకురావడం జరిగిందన్నారు. కార్పొరేట్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహిళలు
మున్సిపల్, టూరిజం,ఆర్ అండ్ బి,బిసి వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, రెవిన్యూ ఇలా చాలా రకాలుగా కొన్ని వేల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి
అన్వర్ పాషా తిరుపతిరెడ్డి మానస
, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.