మస్జిద్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలి
మిర్యాలగూడ, డిసెంబర్ 5 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పరిధిలోని మిర్యాలగూడ మస్జిదే సరాయి మీరాలం కమిటి ఎన్నికలు నిర్వహించాలని మిర్యాలగూడ ముసల్లియానే(నమాజ్ కు వచ్చే వారు) మస్జిదే సరాయి మీరాలం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని వక్ఫ్ బోర్డు సీఈఓ మహమ్మద్ అసదుల్లా,వక్ఫ్ బోర్డు చైర్మన్ కార్యాలయంలో సమర్పించిన వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా మసీదు సభ్యులు ఏంఏ.నాహీద్, సమీ ఖాద్రి, సీనియర్ జర్నలిస్ట్ లు ఖాజా హామిదొద్దీన్, జహంగీర్ ముజీబ్ మోహిద్, ఖమర్ లు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వక్ఫ్ బోర్డు పరిదిలోని పురాతన మస్జిదే సరాయి మీరాలమ్ (పెద్దమస్జిద్) కమిటీ కార్యవర్గం గడువు నవంబర్ 16వ తేదీన ముగిసిందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి మస్జిద్ కమిటి ఎన్నికలు జరగలేదని, ఒకే వ్యక్తి అతనికి సంబంధించిన మద్దతుదారుల నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. మిర్యాలగూడ పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఆస్తులు ఉన్నప్పటికీ వాటికి గుర్తింపు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక చోరవ తీసుకొని ప్రజాసామబద్ధంగా మస్జిద్ కమిటీ కార్యవర్గం ఎన్నికలు నిర్వహించే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటిని నియమించాలని, వక్ఫ్ బోర్డు సీఈఓ కు వివరించామని వారు తెలిపారు.