Home తాజా వార్తలు చల్లూరు శివాలయ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న వొడితల ప్రణవ్

చల్లూరు శివాలయ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న వొడితల ప్రణవ్

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివాలయ ధ్వజ స్థంభ ప్రతిష్టా మహోత్సవ పూజ కార్యక్రమాలలో శనివారం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పాల్గొని,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూలమాలవేసి శాలువా కప్పి, ఘనంగా సత్కరిస్తూ, మహా శివుడి, గణనాధుని, అనుగ్రహ ప్రాప్తి ఉండాలని, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment