తుంగతుర్తి, నవంబర్ 26,( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం తిరుమలగిరి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 21 మంది లబ్దిదారులకు రూ.9 లక్షల 11 వేల 500 ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే సామెల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి ఇప్పటివరకు దాదాపు రూ.కోటి 80 లక్షల వరకు నిధులు విడుదల కావడంతో పాటు 5000 మందికి ఎల్ఓసి ఇవ్వడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫండ్ విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తప్పట్ల శంకర్, జిల్లా నాయకులు దాసరి శ్రీను,కొండ రాజు, కుంచాల ప్రవీణ్ రెడ్డి, కలకోట్ల మల్లేష్, రుద్ర రామచంద్రు, సగ్గం నరసయ్య, మంగళపల్లి నాగరాజు, మిరియాల నాగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.