తెలంగాణ ఎక్స్ ప్రెస్ 28/11/24
భైంసా పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ
ఇది రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కొరకే పని చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ అన్నారు.
దిలావర్పూర్ విత్తనాలు కంపెనీకి అనుమతి 7 జులై 2023లో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ డైరెక్టర్గా ఉన్న కంపెనీకి కేసీఆర్ అనుమతిని ఇచ్చారు. అప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కూడా వారు తీసుకోవడం జరిగింది. కానీ టిఆర్ఎస్ పార్టీ వారు బట్ట కాల్చి మీద వేస్తున్నట్టు చేస్తున్నారు.
ఫ్యాక్టరీకి అనుమతినిచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమే అయినా గాని రైతులను రెచ్చగొట్టి ఆందోళన బాట చేసే విధంగా ప్రేరేపించడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ మాట్లాడుతూ ఆ ఫ్యాక్టరీ కి అనుమతి ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మళ్లీ రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధి ఉందని అందుకే పూర్వపరాలు పరిశీలించి రైతుల పక్షాన నిర్ణయము తీసుకుంటామని రైతుల యొక్క నిర్ణయానికి శిరసావా ఇస్తామని ప్రభుత్వ హామీ ఇచ్చిందని తెలిపారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రైతులకు సంకెళ్లు వేసి, జైల్లో పెట్టినటువంటి ఘటనలు చాలానే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి గౌడ్, మైసేకర్ సాయిలు, అహ్మద్ సాబ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఆలూరు ప్రశాంత్, సయ్యద్ అల హష్మీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నడుమిశెట్టి భూమన్న, సాయినాథ్ పటేల్, మౌలా సాబ్, రామ్నాథ్ నాయక్, అహ్మద్ ఖాన్ సాబ్, ఖదీర్, అబ్బులాల,భగవాన్ పటేల్, గంగాధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు
ఇది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంబైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్
50
previous post