98
- నాయకులు, ప్రజలు, విద్యార్థుల డిమాండ్
దౌల్తాబాద్, తెలంగాణ ఎక్స్ప్రెస్ (అగస్ట్30):
అన్ని అర్హతలు ఉన్న గోకఫసల్ వాద్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్థులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. చాలా కాలంగా తాము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని వారు అన్నారు.చుట్టూ చాలా గ్రామాలు, తాండాలు ఉన్నాయని, గ్రామం నుండి అన్ని గ్రామాలకు సరైన రవాణ సౌకర్యం ఉందని వారు తెలిపారు. ఇప్ఫటికైనా స్థానిక ఎమ్మెల్యే ఈ విషయం పై దృష్టి సారించి గోకఫసల్ వాద్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేలా చెయ్యాలని గ్రామస్థులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.