ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగించడానికి సీపీఐ కృషి
సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు కలిందర్ అలీఖాన్
మంచిర్యాల, డిసెంబర్ 04, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన ఎన్నికలు, డిసెంబర్ 3న వెలుబడిన ఫలితాలు ప్రజాస్వామ్యంలో అహంకార వైఖరిని ప్రజలు అంగీకరించరనే విషయాన్ని వెల్లడించే విధంగా ఉన్నాయని సిపిఐ కార్యవర్గ సభ్యుడు ఖలిందర్ అలీఖాన్ అన్నారు. సోమవారం జన్నారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖలిందర్ అలీఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో విలువలతో కూడిన పాలన ముఖ్యమని, ప్రజా గొంతుకగా చట్ట సభల్లో సిపిఐ తన గళాన్ని వినిపించేందుకు ప్రజలు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సిపిఐ మిత్రపక్ష కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించడం, కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపుకు సహకరించిన ప్రజలకు పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేడ్మా బోజ్జు పటేల్ కు సిపిఐ మద్దతు తెలిపామన్నారు. నియంతలా, నిరంకుశంగా పాలన సాగించిన పాలకులకు ఈ ఎన్నికలు గుణపాఠాన్ని నేర్పాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తే సహించేది లేదని, ఆత్మగౌరం కోసం, ఆత్మగౌరవ పరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ఎప్పుడు పోరాటంలో ముందుంటారని తెలిపారు. ఎర్ర జెండా పార్టీలు ఎప్పుడు అధికారం కోసం తాపత్రయపడవని, ప్రజల సమస్యలపై, ప్రజా సంక్షేమంపై పోరాటాలు సాగిస్తాయని అన్నారు. ఓడితే గెలువచ్చని, పడితే లేవచ్చని, కానీ లాలుచీపడితే చరిత్ర క్షమించదని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కోసం కాకుండా ప్రజలకు సుపరిపాలన అందాలనే లక్ష్యంతో ఒక్క సీటుకు కట్టుబడి రాష్ట్రంలోని 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలువుకు పార్టీ శ్రేణులు కృషి చేశాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా పాలన అందించడానికి తమ వంతు పోరాటాలు వుంటాయాని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు పాలన అనిదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల కన్వీనర్ మామిడి విజయ్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపెళ్లి పౌలు, దేవి పొచన్న, చాడ మహేందర్ రెడ్డి, భాసు పటేల్, రవి, భీమయ్య, మచ్చ శంకరయ్య ఇసాక్ వాసవి పటేల్, పద్మావతి, ముజఫర్ అలీ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.