మంచిర్యాల, జనవరి 23, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) : రాష్ట్రంలో వచ్చే నెల నాలుగవ వారంలో రేషన్ కార్డు దరఖాస్తులు ప్రజా ప్రభుత్వం స్వీకరించనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్కార్డుల కోసం ప్రజల నుండి దరఖాస్తులకు అనుమతి చేస్తున్ననట్లు తెలుస్తున్నాయి. రాష్ట్రంలో ఆరు గ్యారంటీ హామీలను విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో మాదిరిగానే మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు తెలిసింది. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాటిని ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్నది. రాష్ట్రంలో చాలా మందికి రేషన్కార్డులు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 2.86 కోట్ల మంది లబ్ధిదారులు . బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలకు సుమారు 6.5 లక్షల కొత్త రేషన్కార్డులను జారీ చేశారు. తద్వారా సుమారు 20 లక్షల మందికి లబ్ధి జరిగిందని తెలుస్తుంది.
వచ్చి నెల నాలుగవ వారంలో రేషన్ దరఖాస్తులు స్వీకరించనున్న ప్రజా ప్రభుత్వం
36
previous post