Home తాజా వార్తలు సమస్యలు తొలగి ప్రజల ఆకాంక్ష నెరవేరాలని భగవంతుడిని వేడుకున్నా మంత్రి పొన్నం

సమస్యలు తొలగి ప్రజల ఆకాంక్ష నెరవేరాలని భగవంతుడిని వేడుకున్నా మంత్రి పొన్నం

by Telangana Express

సుందరగిరిలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి డిసెంబర్ 23
( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం చిగురు మామిడి మండలం సుందరగిరి లో, చిన్న ముల్కనూరు లోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించుకున్నారు. సుందరగిరి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా మంత్రి పొన్నం ప్రభాకర్, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ. గత ప్రభుత్వం పదేళ్ల పాలన లో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందక, పింఛన్లు రాక, ఉద్యోగాలు లేక కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా భగవంతుడు బలాన్ని చేకూర్చాలని, రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్ధి తో పాటుగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీ లను నెరవేర్చి, ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా భగవంతుడుo ఆశీర్వదించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ గందె సంపత్, గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా నాయకులు చిటిమల రవీందర్, కౌన్సిలర్ చిత్త రి పద్మ రవీందర్, కేడం లింగమూర్తి, మహిళా నాయకురాలు ఓరుగంటి భారతి దేవి, దాసరి ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment