- విద్యార్థుల రాజకీయ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి వగ్గు వినయ్ విప్లవ్
ఆమనగల్లు, ఏప్రిల్ 05
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
దేశంలో బిజెపి, రాష్ర్టంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశారు. అమలు కానీ పథకాలను అమలు చేస్తామని అసత్య ప్రచారాలు చేసే వారి వల్ల ప్రజలకు జరిగే మేలు ఏమి లేదని, సిటిజెన్ జాతీయ యూత్ పార్లమెంట్ అవార్డ్ మెంబర్, విద్యార్థుల రాజకీయ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి వగ్గు వినయ్ విప్లవ్ అన్నారు. మోడీ 400 ఎంపీ లు ఇవ్వండి రాజ్యాంగం మారుస్త అంటాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఉచిత హామీలు అని మోసం చేయడం, బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ప్రజల ఆలోచనలను మార్చాలని ఒకరిని ఒకరు తిట్టుకోవడం, తప్ప దేశంలో, రాష్ర్టంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు,రైతుల ఆత్మ హత్యలు జరగకుండా ఎలా ఆపాలి, ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి అనే కనీసం జ్ఞానం లేని పార్టీలు, ఎంత సేపు మేము అధికారం లోకి రావాలి, మాకు ఓటు వేయండి అంటూ ప్రజల్ని మోసం చేయటం తప్ప ఈ మూడు పార్టీ ల వల్ల ఒరిగింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. దయచేసి తెలంగాణ ప్రజల్ని ఈ సారి మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, మీ ఓటు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ కు పంపాలి దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతిలోనే ఉందనే విషయం మర్చిపోకుండా మీ అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుకు వేయాలని ఆయన తెలిపారు.