Home తాజా వార్తలు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి….పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలి

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి….పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలి

by Telangana Express
   - జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

తెలంగాణ రాష్ట్ర సర్కార్ గురుకులాల్లో అమలు చేసిన కామన్ డైట్ ను నాణ్యతగా రుచికరంగా అందించాలని, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్ సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆర్ ఎల్ సి కిరణ్ గౌడ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆతర్వాత సంక్షేమ అధికారి దయానంద్ మాట్లాడుతూ… రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ సవరించిన కామన్ మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన భోజనం, స్నాక్స్, పండ్లు అందించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పాఠశాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆతర్వాత పాఠశాలకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో ప్రతిభ చాటి బహుమతులు సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రణాళికా బద్ధంగా సబ్జెక్టుల వారీగా చదివించి వార్షిక పరీక్షలకు సంసిద్ధులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్, ఎస్ఎల్ సి బాలరాజ్, బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment