Home తాజా వార్తలు అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ల పట్టివేత ఎస్ ఐ రమేష్.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ల పట్టివేత ఎస్ ఐ రమేష్.

by Telangana Express

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న గోటూరు శివారులో టాస్క్ ఫోర్స్, ధన్వాడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రమేష్ తెలిపారు.
డ్రైవర్ చాకలి నగేష్, శ్రీనివాసులు,
P సంజన్న, P. రామ్ గోపాల్, ప్రకాష్ రెడ్డి, కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలియజేశారు.
ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలించిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.

You may also like

Leave a Comment