తెలంగాణ ఎక్స్ ప్రెస్ 13/03/25
బైంసా:

: శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో టీం ఆశ్రయ (TEAM ASRAYA) ఫౌండేషన్ కు చెందిన కేదారినాథ్ శరణ్య రూ.యాభై విలువైన ఎల్.ఈ.డి టీవీ ను బహూకరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది శ్రీ ఠాకూర్ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, ఎల్ ఇ డి టీవీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యార్థులకు తెరపాఠం పరిపుష్టమవుతుందని, బోధనలో చిత్రాలు, వీడియోల ద్వారా సమగ్ర అవగాహన కల్పించడం విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా బోధన విద్యార్థులకు త్వరగా నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.
అంతేకాకుండా, శ్రీ సరస్వతీ శిశు మందిరాలు క్రమశిక్షణకు నిలయాలని, విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలని, విలువలతో కూడిన విద్య అందించడం ద్వారా సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ సహా కార్యదర్శి సరుకొండ దామోద, పాఠశాల నిర్వాహక సభ్యులు నూకల సురేష్, శివకుమార్ బచ్చు వార్, బన్నెల్లి సుదర్శన్, పి. కాశీనాథ్, జిలకరి రాజేశ్వర్, దర్బార్ శ్రీశైలం, సాయినాథ్ గుజ్జులవార్, గుజ్జులవార్ లక్ష్మణ్, ప్రాంత సంగీత ప్రముఖ్ సాయినాథ్ పాఠశాల ప్రధానాచార్యులు గంగాధర్, పోషకులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంతేకాదు, టీం ఆశ్రయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, అధికారులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. సేవా గుణాన్ని అలవర్చుకోవడం ద్వారా సమాజ సేవను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి అనే సందేశాన్ని వక్తలు అందరికీ అందించారు.