Home తాజా వార్తలు జెండా సాక్షిగా సరస్వతీ మాతకు అవమానం*

జెండా సాక్షిగా సరస్వతీ మాతకు అవమానం*

by Telangana Express

–  సరస్వతీమాతను దూషించిన వారిని  చట్టపరంగా శిక్షించాలి.

– హిందూ ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్  రాంబాబు.

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, జనవరి 28 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
గణతంత్ర  దినోత్సవ వేడుకల  రోజున నారాయణపేట జిల్లా మద్దూరు లో సరస్వతి మాతను దూషించిన వారిని చట్టపరంగా శిక్షించాలని హిందూ ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ రాంబాబు విజ్ఞప్తి చేశారు. చదువుకున్న  ప్రతి ఒక్కరు సరస్వతి మాతను చదువుల తల్లిగా భావించి పూజిస్తారని అలాంటి సరస్వతి మాతను కించపరుస్తూ ,  పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పరుశ పదజాలంతో దూషించిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని హిందూ ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ రాంబాబు అన్నారు ,మద్దూర్ లో జరిగిన సంఘటనను నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బజరంగ్దళ్ , విశ్వహిందూ పరిషత్, దుర్గా వాహిని  హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు నారాయణపేట పోలీస్ స్టేషన్లో  ఎస్ఐ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి ప్రవీణ్ కడుదాస్, ఉపాధ్యక్షులు కన్న శివకుమార్ గౌరవ అధ్యక్షులు  క్యాతన్ రఘు, నగర సంఘ్ చాలక్  మదన్ మోహన్ రెడ్డి ,బజరంగ్దళ్ అధ్యక్షులు శ్రవణ్,నీరటి వెంకటేష్, ఆకాష్,  వీరేష్,నితీష్, జంగం శేఖర్ ,అనిల్ రెడ్డి , మల్లేష్, ఆంజనేయులు,దుర్గా వాహిని సభ్యులు సుర, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment