ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జై గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రాంగోళ్ల మురళి గౌడ్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్ర పటానికి జై గౌడ్ సంఘ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు మత్తమాల ప్రశాంత్ గౌడ్ లు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటను ఏలిన మహావీరుడని కొనియాడారు. తెలంగాణలో మోగులాయిల విస్తరణను తొలి సారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జై గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రంగోళ్ళ మురళీగౌడ్, ఉపాధ్యక్షులు మత్తమాల ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శ అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, అంకన్నగారి నాగరాజుగౌడ్, బండారి సాయిరాం గౌడ్, సుక్క నవీన్ గౌడ్, నాయకులు చెన్న లక్ష్మణ్, చింతల శంకర్, సుఖేందర్ రెడ్డి, బిట్ల సురేందర్, తదితరులు పాల్గొన్నారు.