Home తాజా వార్తలు తెలంగాణ జాగృతిలో చేరిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్

తెలంగాణ జాగృతిలో చేరిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 10,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
Eddo
కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత సంపత్ గౌడ్ కు కండువ కప్పి సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంస్థ ఆశయాలకు, లక్ష్యాలకు అంకితమై పని చేయాలని కల్వకుంట్ల కవిత సూచించారు. తనను సంస్థలోకి ఆహ్వానించిన కవిత కు సంపత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయాచితం శ్రీధర్, తెలంగాణ ఫుడ్స్ రాష్ట్ర మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, నరేందర్ యాదవ్, ఈగ సంతోష్, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment