మిర్యాలగూడ జనవరి 20 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నాగార్జునసాగర్ ఎడమ కాలవ నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాజానికి ధాన్యం ఎంతో అవసరం అని ఆ పంటలను కాపాడాలన్నారు. ఎడమ కాలువ పరిధిలో ఆయకట్టులో బోర్లు, బావులు, చెరువుల కింద 30% వరి పంట సాగు చేశారని భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోతుందని వాపోయారు. పంట పొలాలను కాపాడేందుకు ఎడమ కాలుకు నీటిని విడుదల చేయాలని కోరారు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 524 అడుగుల నీటిమట్టం ఉందని అందులో 15 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశ ఉంటుందని చెప్పారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల అక్కడి ప్రభుత్వంతో మన ప్రభుత్వం చర్చలు జరిపి ఆల్మట్టి ద్వారా నీటిని తెప్పించుకొని సాగర్ ఎడమ కాలుకు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలు పెంపొందించాలన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పది పదిహేను రోజులు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు అలా చేస్తే భవిష్యత్తులో తాగునీటి సమస్య కూడా ఉండదని చెప్పారు. నీటి విడుదల పై ప్రభుత్వ స్పందించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్, నాయకులు గుణగంటి రామచంద్ర, గుంటూరు వీరాచారి, పి రామ్మూర్తి, రామారావు, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.