Home తాజా వార్తలు *బాధిత కుటుంబానికి రూ10 వేలు రైస్ మిల్లర్ మాశెట్టి శ్రీనివాస్ వితరణ*

*బాధిత కుటుంబానికి రూ10 వేలు రైస్ మిల్లర్ మాశెట్టి శ్రీనివాస్ వితరణ*

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ పట్టణం లోని
గాంధీనగర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో దాసరి సతీష్ స్వప్న ల గృహం పూర్తిగా కాలిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రమాద విషయం యువజన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ (ఆర్కే) ద్వారా తెలుసుకుని సహాయం చేస్తాను ఇచ్చిన మాట ప్రకారం గాంధీ నగర్ లోని పెద్ద వెంకటరమణ రైస్ మిల్ యాజమాన్యం మాశెట్టి శ్రీనివాస్
శుక్రవారం రూ10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని స్వప్న సతీష్ కుటుంబానికి అందజేశారు
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గూడపూరి శ్రీనివాస్,ఉబ్బపల్లి రాజశేఖర్ ,మంద శ్రీనివాస్ మరియు మిల్లు కార్మికులు రంజాన్ ,రాము తదితరులు పాల్గొన్నారు.దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మిల్లు యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

You may also like

Leave a Comment