Home తాజా వార్తలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న పీ ఎస్ ఆర్

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న పీ ఎస్ ఆర్

by Telangana Express

ఆలయానికి రూ .2 లక్షల విరాళం

పాత్రికేయుల క్యాలెండర్లు ఆవిష్కరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ జనవరి 11

ధర్మారం మండల కేంద్రంలో గల శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామివారిని శనివారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వెల్గటూర్ మండల మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు (పీ ఎస్ ఆర్) దర్శించుకున్నారు, దర్శనానికి విచ్చేసిన శ్రీనివాసరావుకు ఒగ్గుడోలు కళాకారులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం నాయకులు అభిమానులతో కలిసి గుట్టను ఎక్కి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు దేవాలయ కమిటీ సభ్యులకు రూ .2 లక్షలు ఆలయం గోపుర నిర్మాణానికి విరాళంగా అందజేశారు. అంతే కాకుండా త్వరలోనే మల్లికార్జున స్వామి ఆలయానికి ధ్వజస్తంభం ఏర్పాటుకు ఆర్ధిక సహాయం చేస్తానని మాట ఇచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస రావుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరిం చారు. అనంతరం శ్రీనివాసరావు తో కలిసి స్వామివారిని దర్శించు కున్న ఎండపల్లి మండల పాత్రికేయ మిత్రులు వారి సంస్థకు సంబంధించిన సూర్య (చిలుక సతీష్), నవ తెలంగాణ (బొడ్డు రాజేశం) క్యాలెండర్లను శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

పరమార్శ
ఎండ పల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన గంగదరి రాజయ్య ఇటీవల మృతి చెందగా వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.20 వేలు ఆర్ధిక సహాయం అందించారు.ఆ తర్వాత బొట్ల వనపర్తి గ్రామంలో సంఘ దుర్గమ్మ అనే వృద్ధురాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి పాక వెంకటేష్ ను పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాడే సూర్య నారాయణ, జంగ మహేందర్, డ్యాగేటి ఉదయ్ ఎలుక రాజు, గెల్లు శేఖర్ తిరుపతి రెడ్డి, జాడి రాజేశం,రూప్ల నాయక్, కొత్త నర్సింహులు ఈదుల శ్రీనివాస్ రామస్వామి, చక్రధర్,లక్కాకుల శ్రీనివాస్ గోపు పోచయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోటో, మళ్లీ కార్జున స్వామి ఆలయానికి రెండు లక్షల విరాళం అందిస్తున్న పొనుగో టి శ్రీనివాసరావు

You may also like

Leave a Comment