వెంటనే స్పందించిన కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్….
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఆగస్టు 16:(తెలంగాణ ఎక్స్ ప్రెస్): జవహర్ నగర్ మున్సిపాలిటీ విద్యార్థి గత రెండు సంవత్సరాలుగా ఎం విశాల్ S/o ఎం .శంకర్ గురుకుల విద్యాలయాలో అడ్మిషన్ కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడం జరిగింది.ఇట్టి విషయాన్ని 12వ బిఆర్ఎస్ మహిళా కార్యకర్త, కాలనీ సుశీల మనవడైనా ఎం విశాల్ గురుకుల విద్యాలయం సీటు కొరకు డివిజన్ కార్పొరేటర్ మునిగాలా సతీష్ కుమార్ ని సంప్రదించడం జరిగింది.ఇట్టి విషయాన్ని సతీష్ కుమార్ వెంటనే స్పందిస్తూ,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లి గురుకుల విద్యాలయంలో అడ్మిషన్ కొరకు విజ్ఞప్తి చేయడం జరిగింది.తదనంతరం మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని విశాల్ అనే విద్యార్థికి హయత్ నగర్ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్ ఇప్పించడం జరిగింది.దీనికి గాను మహిళా కార్యకర్త సుశీల మరియు కార్పొరేటర్ సతీష్ కుమార్ మంత్రి మల్లారెడ్డి కి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే సుశీల, మల్లారెడ్డి కి మరియు కార్పొరేటర్ సతీష్ కుమార్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు సోనీ శంకర్,మరియు ప్రీతి,12వ డివిజన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ బాబు పాల్గొన్నారు.