ముధోల్:30జనవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో మండల కేంద్రమైన ముధోల్ లో సీఐ జీ.మ ల్లేష్ ,ఎస్సై సా యికిరణ్ ఆధ్వర్యంలో మంగళ వారం కేంద్ర బలగాలతో కలిసి ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పోలీస్ అధికా రులు ,సాయుధ పోలీస్ సిబ్బం దితో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరై నా అపరిచిత వ్యక్తులు కనిపిం చినట్లయితే పోలీసులకు సమా చారం అందించాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలన్నారు. ఎ న్నికల నేపథ్యంలో ప్రతి రాజకీ య నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్య క్రమంలో ఆర్ఏఎఫ్ ఏఎ స్పీ వినోద్ గోపి, ఎస్ఎం నాగేం దర్ ప్రసాద్, లోకేశ్వరం ఎస్సై సాయికుమార్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల కవాత్తు
72
previous post