మంచిర్యాల, జూన్ 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): దండేపల్లి మండలంలోని మామిడిపెల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు ఆ గ్రామ పెద్దమనిషి ఆధ్వర్యంలో గతంలో ఊరి శివారులో పెద్దమ్మ తల్లి నీ ప్రతిష్టించారు. బుధవారం నుండి ఆదివారం వరకు పెద్దమ్మ, పోచమ్మ తల్లి ఎదుర్కొలుపు బోనాలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రోజుకు ఒక కొలుపు చొప్పున ప్రతిరోజు బైండ్లొల్ల ఆధ్వర్యంలో కొలుస్తారు. గ్రామ ముదిరాజ్ సంగం ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి ఒక మహిళ ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఒక్కపొద్దులతో బోనం వండ్డి తల పైన పెట్టుకొని పెద్దమ్మ పోచమ్మ తల్లి ఆలయం వరకు డప్పు, సన్నాయి, బైండ్లోల్లా చప్పుళ్లతో ముదిరాజులు బోనాలను కొలుస్తారు. ముదిరాజుల కుల దేవత ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లిని అ గ్రామ ఊరి శివారులలో ముదిరాజులు ప్రతిష్టించుకుంటారు. మామిడిపల్లి గ్రామంలో ముదిరాజులు పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి ఆలయాల వరకు తరలివెళ్లి బోనాల కొలుపును ఆ గ్రామ ప్రజలు కనువిందు చేసుకుంటారు. మామిడిపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాలు ఘనంగా నిర్వహించి, సువిశాలమైన మైదానంలో అన్నదానా కార్యక్రమం ఆ గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తరలి వెళ్లి ఎదుర్కొలుపు బోనాలను విజయవంతం చేసుకుంటారు.
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పోచమ్మ తల్లి ఎదురు కొలుపు బోనాలు
64