Home తాజా వార్తలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి

by Telangana Express

సైదాపూర్ మండలంలో 11 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,భూమి పూజ

తొమ్మిది ఏళ్ల పాలన దేశానికి ఆదర్శం అన్నీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి

పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి

ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

సైదాపూర్ ఆగస్టు 25
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సబ్బండ వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ఈ రోజు వే-సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రతి గ్రామంలో డప్పుచప్పులతో మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం నుండి సింగాపూర్ గ్రామం వరకు రూ. 33.35 లక్షల వ్యయంతో ఆర్&బీ బీటీ రోడ్ రిన్యూవల్ పనులకు శంకుస్థాపన,లస్మన్నపల్లి గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మరియు రూ. 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రెడ్డి కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ, వెన్నంపల్లి రోడ్ చత్రపతి శివాజీ విగ్రహం నుండి ఆరెపల్లి వరకు రూ.1కోటి 2లక్షల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి మరియు రూ.20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంఖుస్థాపన, సోమారం గ్రామం నుండి వయా గర్రెపల్లి, సైదాపూర్ వరకు రూ.2కోట్ల 18లక్షల వ్యయంతో ఆర్&బి రోడ్ నిర్మాణానికి మరియు రూ.20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జీవో 59 ద్వారా మంజూరు అయిన 58 మంది లబ్ధిదారులకు నీవేశనస్థలాల పట్టాలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.వె-సైదాపూర్ మండల కేంద్రంలో ఆర్&బి రోడ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు రూ.34.18 లక్షల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి మరియు మండల కేంద్రంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు సోమారం x రోడ్ నుండి రాయికల్ వయా సైదాపూర్, ఘనపూర్ వరకు రూ.5 కోట్ల 45 లక్షలతో బిటి రోడ్డు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు అలాగే మండలంలోని ఇద్దరు లబ్ధిదారులకు1,20,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ గారు పంపిణీ చేశారు.కార్యక్రమంలో
ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి పాక్స్ చైర్మన్లు బిల్ల వెంకట్రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, బిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు సోమారపు రాజయ్య, కార్యదర్శి చల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి, సర్పంచుల పోరం అధ్యక్షులు చంద శ్రీనివాస్, స్థానిక సర్పంచులు అబ్బీడి పద్మా రవీందర్ రెడ్డి, కాయిత రాములు, ఆవునూరి పాపయ్య, పైడిమల్ల సుశీల తిరుపతి గౌడ్, బత్తుల కొమురయ్య, కొత్త రాజిరెడ్డి, కొండ గణేష్, మాజీ జెడ్పిటిసి సభ్యులు బెదరకోట రవీందర్ సీనియర్ నాయకులు, ముత్యాల వీరారెడ్డి కూతురు విధ్వాన్ రెడ్డి బత్తుల లక్ష్మీనారాయణ, యూత్ నాయకులు బోనగిరి అనిల్, మాదం స్వామి, ఎమ్మార్వో దూలం మంజుల, ఆర్ఐ శరత్, ఏ ఈ యాదగిరి, డిఈ, అధికారులు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం చాలా ఇబ్బందులు పడ్డ గర్రెపల్లి గ్రామ ప్రజల శ్రమ ఫలించిన వేళ గ్రామస్తులైన వెన్నంపళ్లి సింగల్ విండో డైరెక్టర్ కౌడగాని మోహన్ రావు బిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు ఎన్నమల్ల రమేష్ తోపాటు ఆరే సంఘం అధ్యక్షులు దోకిడి తిరుపతి వార్డు మెంబర్ దేవరాజ్ శ్రీనివాస్ తిరుపతి రమేష్ రాజు మహేష్ వెంకటి కనుకయ్య మల్లేశం దేవరాజుల బాబు బాబు గిరిపల్లి గ్రామానికి రెండు కోట్ల 18 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు

You may also like

Leave a Comment