Home తాజా వార్తలు ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు….దరఖాస్తులు నిల్…..- తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్

ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు….దరఖాస్తులు నిల్…..- తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 16,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో, సోమవారం జిల్లా కేంద్రం నుంచి విడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్ నిర్వహించిన ప్రజావాణిలో స్థానిక తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ ఏ ఈ వినోద్, హెల్త్ సూపర్ వైజర్ రాజేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మండల పరిధిలోని ప్రజలకు ఏమైన రెవెన్యూ లేదా ఇతర శాఖలకు సంబంధించిన తదితర సమస్యలు ఉంటే ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్య ఏ శాఖ పరిధిలోకి వస్తుందో, ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. ఇట్టి ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదని తహశీల్దార్ తెలిపారు.

You may also like

Leave a Comment