ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
బిజెపి ఎంపి అభ్యర్థి బిబి పాటిల్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా దూషిస్తే బిజేపి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని బిజేపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ, బిజేపి ఎంపి అభ్యర్థి పై పార్టీ పరంగా విమర్శలు చెయ్యి…అంతే గాని వ్యక్తిగత దూషణల జోలికి వెళితే దాని పర్యవసనాలు వేరే లాగా ఉంటాయని హెచ్చరించారు. పదేళ్లు ఎంపిగా బిబి పాటిల్ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలని, బిబి పాటిల్ చేసిన అభివృద్ది పై తాము చర్చకు సిద్దం అని సవాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ తన 5 ఏళ్ల పదవి కాలంలో పార్లమెంట్ లో ఎన్ని సార్లు మాట్లాడారో తమ వద్ద రికార్డులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా బిజేపి గెలుపును ఆపలేరని అన్నారు. ఆ తర్వాత బిజేపి మండల అధ్యక్షుడు నర్శింలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బిజెపి గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు. ఎల్లారెడ్డిలో బీబీ పాటిల్ గెలవకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని అన్నారు . పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ది చెప్పి, భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ గడ్డపై కాషాయపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు భయబ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదని అన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలు అధైర్య పడకుండా, దైర్యంగా పని చేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు ఎల్లారెడ్డి, మండలంలో లీడ్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నెరెల్ల ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.