Home తాజా వార్తలు మండల సర్వ శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం

మండల సర్వ శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం

by V.Rajendernath

ఉద్యోగ భద్రత కల్పించాలని మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు

మంచిర్యాల, ఆగస్టు 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండల సర్వ శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యోమానికి, మండల సమగ్ర శిక్ష ఉద్యమానికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మండల సమగ్ర శిక్ష ఒప్పంద పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యర్యంలో పోస్టు కార్డు ఉద్యమం పి ఆర్ టి యు కార్యాలయం పరిధిలో చేపట్టారు. ఈ సందర్బంగా జన్నారం మండల ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ గత 15 ఎళ్లుగా ఎంఆర్సీ లో వివిధ విభాగల్లో పని చేస్తు విద్యాశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న తమకు ప్రభుత్వం ఇప్పటికి ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన స్కేలును అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి ఉద్యోగికి జీవిత భీమా రూ.10 లక్షలు,ఆరోగ్య భీమా రూ.5 లక్షల సౌకర్యం కల్పించడమే గాకుండా విద్యాశాఖ నియామకాలలో వెయిటేజి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు రాంటెంకి బుచ్చన్న, దయాకర్, నారయణ, విజయ్, అజారొద్దిన్, ఎంఆర్సి సెల్ఫ్ కేజీబీ ఐఇఓపీ లు, సి ఆర్ పి ఎంఐసి సిసిఓ లు, పిటిఐ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment