మహబూబాబాద్, జూన్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో అధికారులు, సబ్ స్టేషన్ ఆపరేటర్ ల నిర్లక్ష్యం వలన విచ్చలవిడిగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని అక్కడి సబ్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఎపుడు వచ్చి ఎపుడు పోతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సబ్ స్టేషన్ ఆపరేటర్ లను సంప్రదించడానికి గత 5 నెలల నుండి కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయిందన్నారు. విద్యుత్ కోత వల్ల త్రాగు నీటికి తీవ్ర సమస్య తల్లేతుందని త్రి ఫేస్ సరిగా ఉండకపోవడంతో కిలో మీటర్ దూరం నుంచి రెండు కిలో మీటర్ ల దూరం వెళ్లి త్రాగు నీటి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఎర్రబెల్లిగూడెం సబ్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా విద్యుత్ కోత
63
previous post