Home తాజా వార్తలు జర్నలిస్ట్ ల రైల్వే పాస్ ల కోసం కేంద్రానికి నివేదిస్తాం …ఎన్ యు జె(ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్

జర్నలిస్ట్ ల రైల్వే పాస్ ల కోసం కేంద్రానికి నివేదిస్తాం …ఎన్ యు జె(ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్

by V.Rajendernath

హైదరాబాద్, జూన్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)దేశంలో జర్నలిస్ట్ రైల్వే పాస్ లు కోసం కేంద్రానికి నివేదిస్తాం అని
ఎన్ యు జె(ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ముస్కాన్ ఫంక్షన్ హాల్ లో టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(ఇండియా) కార్యదర్శి మాట్లాడుతూ..గత 3ఏళ్ల కాలంగా జర్నలిస్ట్ రైల్వే పాస్ లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసారని, మళ్ళీ ఈ పాస్ ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తా మన్నారు. రాష్ట్రంలో టీజేఏ సభ్యులు సభ్యత్వ రుసుము 100రూపాయలు విధిగా చెల్లించాలని కోరారు. టీజేఏ జర్నలిస్టులకు యూనియన్ గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. టీజేఏ తరపున మహాత్మ గాంధీ హౌసింగ్ సొసైటీ సమావేశం జరుపుకోవడం శుభారంభం అన్నారు. జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర, జిల్లా కమిటీలు ఎప్పటికప్పుడు స్పందించాలని కోరారు.
యూనియన్ నడపడానికి నిధుల సేకరణ అవసరం అని, దీనికోసం జర్నలిస్ట్ సమాచార్ మాసపత్రిక ప్రారంభిస్తున్నాం అని ఎన్ యు జె మాజీ చైర్మన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, టీజేఏ, జాప్ ఫౌండర్ అయిన ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జర్నలిస్ట్ సమాచార మాస పత్రిక కు ప్రకటనల సేకరణ బాధ్యత ప్రతి జిల్లా యూనిట్ తీసుకోవాలన్నారు. టీజేఏ యూనియన్ కి సంబంధించిన వార్తలు, స్టోరీలు ఈ పత్రికకు ఇవ్వ వచ్చన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లోని టీజేఏ రాష్ట్ర కార్యాలయాన్ని ఆధునికరించడం, రాష్ట్ర కార్యవర్గం తరచు కార్యాలయానికి రావాలని, ప్రతి నెల విధిగా సమావేశం నిర్వహించి, జర్నలిస్ట్ సమస్యలు, ఇతరత్రా జర్నలిస్ట్ సంబంధమైన చర్చలు జరిపి, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలు, వినతి పత్రాలు అందిస్తుండాలన్నారు. సభ్యత్వ రుసుము ప్రతి టీజేఏ సభ్యులు విధిగా చెల్లించి, తమ బాధ్యతలు నిర్వహించాలన్నారు. మహాత్మగాంధీ జర్నలిస్ట్ సొసైటీ ద్వారా టీజేఏ సభ్యులైన జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అనంతరం టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు మాట్లాడుతూ..జర్నలిస్ట్ లకు కొత్త అక్రిడిటేషన్స్ వచ్చే వరకు పాత అక్రిడిటషన్ కార్డులు రినివల్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 30తో అక్రిడిటేషన్ లు, జర్నలిస్ట్ బస్ పాస్ ల గడువు ముగుస్తుందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉర్దూ భాషసంఘం సభ్యులుగా ఎన్నికైన సత్తార్ ను టీజేఏ సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్ యు జె(ఐ)కార్యవర్గ సభ్యులు డాక్టర్. షేక్ హసీనా, దన్నారపు రాజలింగం, టీజేఏ ప్రతినిధులు మోహన్ యాదవ్, ఖాసీం, ఖాళీల్ అహ్మద్, మొహమ్మద్ గౌరీ, సంపత్ కుమార్, కుమార స్వామి, ముఖిమోద్దీన్, ఆరిఫ్ ఖాన్, యాదిల్, యాదగిరితో పాటు 200మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment