ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )పాత్రికేయ వృత్తిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుదేనని ఎన్ యు జె(ఐ)కార్యదర్శి రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం రామోజీ మృతి పట్ల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ సంతాపసభ ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభకు హాజరైన రాజేందర్ నాథ్ తో పాటు తో తోటి జర్నలిస్టులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఎన్ యూ జె(ఐ)కార్యదర్శి మాట్లాడుతూ..రామోజీమృతి పిస్టుల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు. ఈనాడు పత్రిక రాక ముందు పాత్రికేయ వృత్తి పట్టణాలకు, జిల్లా కేంజ్రాలకే పరిమితం అయ్యేది, రామోజీ రావు స్థాపించిన ఈనాడు పత్రికలో జిల్లా అనుబంధం తీసి, నియోజక వర్గ, మండల స్థాయి పాత్రికేయులు ఏర్పాటు చేసి, జర్నలిజం వృత్తిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారని, తరువాత అన్నీప్ పత్రికలు మండల స్థాయిలో రిపోర్టర్ లను పెట్టారన్నారు. ప్రతిభకు గుర్తింపు నిచ్చి, జర్నలిజంతో ఎన్నో ప్రజా సమస్యలకు చెక్ పెట్టారన్నారు. ప్రతి జర్నలిస్ట్ రామోజీ అడుగు జాడల్లో నడవాలన్నారు. ఈ సంతాప సభలో జిల్లా అక్రిడి టేషన్ కమిటీ గ్రామీణ ప్రాంత సభ్యుడు సోమయాజుల రాజ్ కుమార్ , సీనియర్ జర్నలిస్టు న్యాయవాది పద్మ పండరీ, సీనియర్ జర్నలిస్టులు శివ, సిద్దుగౌడ్, తుప్తేవర్ శివకుమార్, శ్రీనివాస్ రావు, మహేష్, ముత్తి రాములు, ప్రశాంత్ గౌడ్, పృథ్వి రాజ్, అమృత్ రావు, సంతోష్, పట్టేం ప్రసాద్, సంతోష్, ఆకుల వెంకట్, లక్మి నారాయణ, ఎలక్ట్రానిక్స్, అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
పాల్గొన్నారు.