65
ఎల్లారెడ్డి, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల బాలకిషన్ కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాలకిషన్ మిత్రులైన జాతీయ జర్నలిస్ట్ సంఘం (ఎన్ యు జె(ఐ ) కార్యదర్శి వి.రాజేందర్ నాథ్, నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి, ప్రముఖ వ్యాపారులు రాజులు, ఎర్ర శ్రీనివాస్ లు కలుసుకొని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.