Home తాజా వార్తలు నేపాల్ దేశంలో జరిగిన మాతృభాషలో జర్నలిజం శతాబ్ది వేడుకలు.

నేపాల్ దేశంలో జరిగిన మాతృభాషలో జర్నలిజం శతాబ్ది వేడుకలు.

by V.Rajendernath

నేపాల్, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)నేపాల్ దేశంలోని ఖాట్మండు, జ్వాలాఖేల్ లలిత్పూర్ ప్రాంతాలలో మాతృ భాషలో జర్నలిజం – ఆధునిక భాషలో జర్నలిజం శతాబ్ది వేడుకలను సార్క్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వివిధ దేశాల ప్రతినిధులను సమావేశం ఇటీవల జరిగింది.మొట్ట మొదటి నేపాల్ జర్నలిస్టు ధర్మాధిత్య ధర్మాచార్య జ్ఞాపకార్థం
సార్క్ జర్నలిస్ట్ ఫోరం- నేషనల్ ఫోరం ఆఫ్ నెవార్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ జర్నలిస్టుల సమావేశం
మాతృభాషలో జర్నలిజం – ఆధునిక భాషలో జర్నలిజం పై చర్చ
నేపాల్ లో వివిధ దేశాల జర్నలిస్టుల సమావేశం జరిగింది.
భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు సీనియర్ జర్నలిస్టు కె.వి. రమణారావు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ అధ్యక్షురాలు మొదటి మహిళా అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి, ఉప ప్రధాని నారాయణ్ కాజి, తిమి మేయర్ సురేంద్ర శ్రేష్ఠ సార్క్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు రాజు లామా, అబ్దుల్ రెహమాన్, అనిరుధ్ సుధాన్షు ,కిన్లీ, తెలుగు భాష పై మాట్లాడటానికి కె.వి.రమణారావు ఉర్దూ భాష విశిష్టతను తెలుపదానికి మహమ్మద్ యూసఫ్ ఖాద్రి, మహమ్మద్ నసీర్ ఖాద్రి, మహమ్మద్ అరిఫ్ లు విచ్చేసిన కార్యక్రమానికి బ్రిపేంద్ర లాల్ శ్రేష్ఠ అధ్యక్షత వహించగా కె.కె. మనందర్ , రాజేష్ భద్రచార్యలు స్వాగతం పలికారు.
సూరజ్బిర్ బజ్రచార్య,నారాయణ్ సుందర్ కిలంబు, పుష్కర్ భక్త మతెమా,సురేష్ కిరన్ మనందర్, కిరన్ శాక్య,రాజు శాక్య,మోహన్ దువాల్,ఈశ్వర్ జోషి,నరేష్ బిట్ శాక్య, బిజయ్ రత్న, అసోన్ బరే,ఉపేశ్ మహార్జన్ తదితర అతిధులు పాల్గొన్నారు. భారత దేశ ప్రతినిధిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు కె .వి.రమణారావు సమావేశంలో మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారతదేశ ఓన్నత్యాన్ని,వివిధ మతాలు ,కులాలు,ఉప కులాలు ఆచార వ్యవహారాలు,భిన్న సంస్కృతుల గురించి వివరిస్తూ భారతీయుల మంతా ఒక్కటే అని ప్రపంచ దేశాలకు చాటారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగుభాష పై మాట్లాడుతూ తీయనైన ,మధురమైన, సరళమైన తెలుగు భాష గొప్ప తనాన్ని అ అంటే అమ్మ ఆ అంటే అవు అని తెలుగు భాషను పిల్లలకు నేర్పుతారని మాతృ భూమి,మాతృ భాష,అమ్మ ను ఎప్పటికీ మరచిపోరాదు అని హితవు పలికారు, అవు గొప్పదనాన్ని కూడా వివరిస్తూ అంతర్జాతీయ సదస్సులో భారత దేశ కీర్తిని చాటారు. ఈ సమావేశంలో నేపాల్, భారతదేశం, భూటాన్ బంగ్లాదేశ్,పాకిస్తాన్,మాల్దీవ్స్ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేపాల్ దేశంలో
సీనియర్ జర్నలిస్టు రమణా రావును మాజీ నేపాల్ అధ్యక్షురాలు, ఉప ప్రధాని, నగర మేయర్ తదితరులు సన్మానించారు.

You may also like

Leave a Comment