Home తాజా వార్తలు పర్యావరణ పరిరక్షణతోనే భావి తరాలకు మనుగడ…- ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక

పర్యావరణ పరిరక్షణతోనే భావి తరాలకు మనుగడ…- ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జూన్ 5,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

పర్యావరణ పరిరక్షణతోనే భావి తరాలకు మనుగడ అని , ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక అన్నారు. బుధవారం స్థానిక కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ఆమె స్థానిక కోర్టు బార్ కౌన్సిల్ అద్యక్షులు నవీద్ పర్వేజ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తో కలిసి మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఆతర్వాత జడ్జి గౌండ్ల హారిక మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా కృషి చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని పిలుపు నిచ్చారు. అలాగే పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే, వృక్షాలుగా మారి రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందని అన్నారు. ఇందు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రకృతిని పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక, కోర్టు సూపరింటెండెంట్ మమత, కోర్టు బార్ కౌన్సిల్ అద్యక్షులు నవీద్ పర్వేజ్ , న్యాయవాదులు సాయి ప్రకాష్ దేశ్ పాండే, గోపాల్ రావు , నామ శ్రీనివాస రావు, సతీష్ కుమార్, పద్మ పండరి, నామ శ్రీకాంత్, నాగం సాయిబాబా, సీనియర్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్, సిబ్బంది రాజ్ మోహన్, ప్రమోద్, రవి గౌడ్, సతీష్, జ్యోతి, కోర్టు కానిస్టేబుల్స్ నిరంజన్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment