Home తాజా వార్తలు వేంకటేశ్వరస్వామి మధుర నామ స్మరణతో స్వామివారి అశీస్సులతో  ప్రతి ఒక్కరూ అ స్వామి నామస్మరణతో జీవించాలి

వేంకటేశ్వరస్వామి మధుర నామ స్మరణతో స్వామివారి అశీస్సులతో  ప్రతి ఒక్కరూ అ స్వామి నామస్మరణతో జీవించాలి

by V.Rajendernath

తిరుపతి, మే 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

వేంకటేశ్వరస్వామి మధుర నామ స్మరణతో స్వామివారి అశీస్సులతో  ప్రతి ఒక్కరూ అ స్వామి నామస్మరణతో జీవించాలని టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్అన్నారు. సోమవారం ప్రముఖ సంస్కృతిక సేవాసంస్ధల అద్యక్షుడు జర్నలిస్టు లయన్ కె.వి.రమణారావును ఆధ్వర్యంలోతిరుపతి పట్టణంలోనిమహతి కళాక్షేత్రంలో జైజవాన్ జైకిసాన్ జై కళాకార్ సంస్ధ పదకవితా పితామహుడు శ్రీ అన్నమాచార్య 616వజయంతి వేడుకలలో భాగంగా, శ్రీ శ్రీ శ్రీ అన్నమయ్య సంగీత నృత్యోచ్ఛవం పేరిట నిర్వహించిన సంగీత నృత్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్ తిరుపతి పుణ్య క్షేత్రంలో జరిగిన అన్నమయ్య సంగీత నృత్యోస్ఛవంలో పాల్గొనడం గురువులకు కళాకారులకు పూర్వజన్మ సుకృతంగా భావించాలని తెలుపుతూ,  కళాకారులకు అభినందనలు తెలిపారు. మరొక విశిష్ట అతిథి శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 14 వ తరం వంశీకులు శ్రీ హరినారాయణాచార్యులు మాట్లాడుతూ సదా ఆ స్వామి వారి కైంకర్యములో పాల్గొనే అదృష్టాన్ని ప్రసాదించిన తాళ్ళపాక అన్నమాచార్యులకు ప్రణమిల్లుతూ ప్రతి క్షణం ఆ వేంకటేశ్వరస్వామి మధుర నామ స్మరణతో స్వామివారి అశీస్సులతో ప్రతిరోజూ ఎటువంటి ఆటంకం లేకుండా గడుస్తుందని ప్రతి ఒక్కరూ అ స్వామి నామస్మరణతో జీవించాలని తెలిపారు. విజన్ వివికె హౌజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి విజయ్ కుమార్ , రాష్ట్ర రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష్యుడు కొత్తపల్లి మునిరత్నం,టిటిడి మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిన్నంగారి రమణ, మబ్బు సూర్యనారాయణ రెడ్డి తదితర అతిథులు పాల్గొన్నారు.
గురువులు సాలెం శ్రీవిద్య, తి యామిని,  జక్కిడి ప్రసన్నారెడ్డి,  మైథిలి దినకరన్,  మంజాల పద్మజ,లక్ష్మి ప్రవీణా,  సిందిరి ఆశా, సునీతాదేవి,  జయలక్ష్మి శ్రీనివాస్,తంగిరాల కృష్ణప్రియ, మీనాక్షి శివకుమార్, కావూరి నాగజ్యోతి,కుమారి దుర్గా మంత్రవాడి తదితరులు పాల్గొని జర్నలిస్ట్ లయన్ కె.వి.రమణారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అద్బుతంగా జరిపిన సందర్భంగా దేశ విదేశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మన కళాకారులను ప్రొచ్చహిస్తూ కళలను విశ్వ వ్యాప్తం చేయడానికి కృషిచేస్తున్నందుకు గాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, గురువులు తిరుపతి పట్టణ ప్రజల సమక్షంలో కె వి రమణారావును ఘనంగా సన్మానించి సత్కరించారు.

You may also like

Leave a Comment