74
తాడ్వాయి, మే 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చాలా కాలంగా నీటి ఎద్దడి ఉంది. ఈ సమస్యను గత కొన్ని రోజుల క్రితం ఆ గ్రామ కాంగ్రెస్ నాయకుడు రాజప్ప ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లి బోర్ మంజూరు చేయించాడు. శుక్రవారం బోర్ బండి రావడంతో, కాంగ్రెస్ నేత రాజప్ప పూజ చేసి బోర్ డ్రిల్ చేయించారు. పుష్కలమైన నీరు రావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ..ఎమ్యెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.