Home తాజా వార్తలు దేశాన్ని భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

దేశాన్ని భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

by V.Rajendernath

కామారెడ్డి, మే 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

ప్రమాదంలో భారత రాజ్యాంగం అనే కరపత్రాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అంబెడ్కర్ సంగం గౌరవ అధ్యక్షులు మల్లన్న ,జిల్లా అధ్యక్షులు కొత్తల గంగారాం, భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, పీడీయస్. యూ జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ

దేశ భవిష్యత్తును నిర్ణయించేవి పార్లమెంటు ఎన్నికలు
దేశ స్వతంత్రం తర్వాత మన దేశ అభివృద్ధికి బహుజన (బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ) వర్గాల సంక్షేమానికి సామాజిక న్యాయానికి అండగా ఉన్నది కేవలం మన గొప్ప రాజ్యాంగం మాత్రమే సమానత్వం స్వేచ్ఛ ప్రజాస్వామ్య హక్కులు మతసామరస్యం వంటి ఎన్నో హక్కులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగ విలువలకు ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి భావజాలం వ్యతిరేకం
2024లో మోడీ మళ్ళీ ప్రధాని అయితే కొత్త రాజ్యాంగాన్ని తెస్తాం,రిజర్వేషన్లు తీసేస్తాం,ప్రాచీన మనుధర్మాన్ని మళ్లీ అమలులోకి తెస్తాం.
అని బిజెపి నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి.
బీసీ సంక్షేమ సంగం జిల్లా అధ్యక్షులు శివరాములు,బిసి సంగం రాష్ట్ర బాద్యులు మధుసూదన్ ,ఉమ్మడి జిల్లా కురుమ సంగం జిల్లా అధ్యక్షులు మార్కంటి భూమన్న,
2014 నుండి బిజెపి పాలనలో
దళితులు,ఓబీసీలు, ఆదివాసీలపై 48 శాతం దాడులు పెరిగాయి.ఈ దేశంలో నిరుపేదలు అయినా ఓబీసీలు 52 శాతం ఉన్న వారికి రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలకు10% రిజర్వేషన్స్ ఇచ్చి ఓబీసీలకు అన్యాయం చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం.దేశంలో కుక్కలు పందులు చివరికి అడవిలో పులుల లెక్క ప్రభుత్వం దగ్గర ఉంటుంది కానీ బీసీ జనాభా శాతం ఎంత ఉందో తెలియదు.
అందుకే బీసీ జనగణన చేయమంటే బిజెపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందని వ్యతిరేకిస్తున్నారు. అసలు బిజెపి నాయకులు రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బిల్కీస్ భానోపై అత్యాచారం దళిత మైనర్ బాలికలపై దాడులు అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ కులం పేరు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి దేశంలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు అలాంటి రైతులకు (స్వామినాథన్ కమిషన్ ప్రకారం) కనీస మద్దతు ధర ఇస్తామని 2014, 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ అమలు చేయకపోగా మూడు కార్పొరేట్ చట్టాలను తీసుకొచ్చాడు అవి రైతులకు నష్టాన్ని తెచ్చేవిగా ఉన్నాయని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలల పాటు నిరసన చేస్తే అమాయకులైన రైతులపై దాడులు చేయడం వల్ల 750 మంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. మోడీ పాలనలో ప్రతి 45 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య జరిగింది. ఇదేనా ప్రపంచానికి తిండి పెట్టే రైతుకు మనం ఇచ్చే విలువ.
ఆదాని,అంబానీ,వాల్మార్ట్ మొదలగు బడా కంపెనీలకు లక్షల కోట్లు మాఫీ చేసిన బిజెపి ప్రభుత్వం రైతులకు చిన్న వ్యాపారులకు అండగా ఉండదా? ఇదేనా ప్రజాస్వామ్యం?
బిజెపి ఎన్నికల మేనిఫెస్టో ఎంతవరకు అమలుచేశారూ అని అడుగుతున్నారు.
ఏక్ బారత్ శ్రేష్టభారత్ సబ్కా సాత్ సబ్ కా వికాస్ (ఒకే భారతం ఉత్తమభారత్ అందరికీ ఐక్యత మరియు అభివృద్ధి )ఈ నినాదంలో ఐక్యత అనేది ఎక్కడ కనిపిస్తుంది. మణిపూర్ రాష్ట్రం మారణకాండ లో విచక్షణ రహితంగా గిరిజన మహిళలు చిన్నపిల్లల మీద కూడా దాడి చేసి చంపినా,ఇల్లు తగలబెట్టినా కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.ఆ రాష్ట్రం మన దేశంలోనిది కానట్టు ప్రవర్తించి నెలల పాటు నెట్వర్క్ బంధు చేసి దాడులు చేయడం లో ఎక్కడ సమానత్వం ఉంది .ఈరోజు మోడీ మైనార్టీల మీద చూపిస్తున్నటువంటి ద్వేషం, వివక్ష వలన ఐక్యత ఎట్లా చేకూరుస్తుంది. మైనార్టీలను రెండవ పౌరులుగా చూడడం ఎంతవరకు సమంజసం.
ఇక అభివృద్ధి పార్లమెంట్ సాక్షిగా 85% ప్రజలకి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నమని చెప్పడం జరిగింది. ప్రజలు అభివృద్ధి జరిగితే ఉచిత బియ్యం ఎందుకు అవసరం? ఇక్కడ ప్రజలు అభివృద్ధి జరగలేదు గుజరాత్ కి సంబంధించినటువంటి ఎనిమిది మంది వ్యాపారవేత్తలను అభివృద్ధి చేయడం జరిగింది. లక్షల కోట్ల డబ్బులను వారికి మాఫీ ఇచ్చి వారిని అభివృద్ధి
చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో స్వేతా పత్రం విడుదల చేయాలి.
బేటి బచావో బేటి పడావో అనే నినాదంతో ముందుకు వచ్చిన మోడీ ఎక్కడ భేటి బచావో చేశారు. బిల్కిస్ బానో లాంటి స్త్రీలను అత్యాచారం చేసిన దుర్మార్గులను కోర్టు నుండి విడిపించి సన్మానం చేసిన ఘనత బిజెపి,ఆర్ఎస్ఎస్ లది కాదా? ఇక్కడ భేటీ బచావా అమలైందా? సాక్షి మాలిక్ మొదలగు మహిళా బాక్సర్లను అవమానించిన వారికి మద్దతు ఇచ్చిన బిజెపిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ బేటి బచావో ఉంది.
బేటి పడావో కేటాయించిన బడ్జెట్లో 25% కూడా ఖర్చు పెట్టలేదు భేటీ ఎలా చదువుకుంటుంది.
ప్రజలారా అర్తం చేసుకోండి ఏ ఒక్కటి కూడా రాజ్యాంగ బద్దంగా అమలు చేయడం లేదు. అది కాకా రాజ్యాంగన్నే మారుస్తాం అంటున్నారు.
మన చేతులో గొప్ప ఆయుధం ఉంది అదే ఓటు ఒక్కసారి దానిని మన కోసం,మన పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి.ఓటును ఇలాంటి మన,పిల్లల బతుకులను నాశనం చేసే వారికోసం వేయకండి.ఓటు వేసే ముందు ఒక్కసారి మీ పిల్లల బతుకును ఆలోచించండి.దయచేసి ఆలోచించమని ప్రార్థిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో నారాయణ రావు ,అజీ అబ్దుల్ అజీజ్, అణ్వర్ పాషా,ఆర్బాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment