77
ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ.పాటిల్ విజయం కోసం ఆయన తనయుడు అభిషేక్ పాటిల్ ఎల్లారెడ్డిలో బుధవారం వ్యాపారస్థుల వద్దకు వెళ్లి తన తండ్రిని గెలిపించాలని కోరారు. ఎల్లారెడ్డి బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులతో కలిసి పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో, వ్యాపార సముదాయల్లో ప్రచారం నిర్వహించారు. దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని మెజార్టీ ప్రజలు నిరయించుకున్నారన్నారు.