Home తాజా వార్తలు జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని యువకుని మృతి…

జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని యువకుని మృతి…

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మే 7, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన, మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపిన కథనం ప్రకారం వివరాల ఇలా ఉన్నాయి. బిక్కనూర్ గ్రామానికి చెందిన బేస్త కృష్ణ ( 20) అనే యువకుడు జీవితం పై విరక్తి చెంది మనస్థాపానికి గురై మండలంలోని మల్లయాపల్లి గ్రామ శివారులోని పోచారం కాలువ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి కి గల కారణాలు ఆరాతీశారు. మృతుడి పెద్ద నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బొజ్జ మహేశ్ వివరించారు.

You may also like

Leave a Comment