Home తాజా వార్తలు పదిలో శ్రీ చైతన్య విద్యార్థుల విజయ దుందుభి….- ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి

పదిలో శ్రీ చైతన్య విద్యార్థుల విజయ దుందుభి….- ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి

by V.Rajendernath

మేడ్చల్, మే 2,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):మేడ్చల్ పరిధిలోని కొంపల్లి శాఖ -1 శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరములో 10వ తరగతిలో అత్యధిక 10/10 జీపీఎస్ మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచి విజయ దుందుభి మోగించారని , ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డు ఆఫ్ సెకండరీ వారు మంగళవారం విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో, తమ పాఠశాల నుంచి 21 మంది 10/10 జీపీఎస్, 35 మంది 9.8/10 జీపిఎస్ మార్కులు సాధించి పాఠశాలకు, తల్లి దండ్రులకు మంచి పేరు తెచ్చారన్నారు. హాజరైన విద్యార్తులలో 60 శాతం మంది పైన 9 ఆపైన జిపిఎస్ మార్కులు సాధించడం గర్వకారణం అని పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎ.జి.యం. జి.వి. రమణా రావు విద్యార్థులను, తల్లి దండ్రులను, ఉపాద్యాయ బృందం ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి, కో ఆర్డినేటర్ శ్రీ జైపాల్ రెడ్డి, డీన్స్ సోమేశ్వర్ రావు , శ్రీ అఖిల్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment