Home తాజా వార్తలు ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం

ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మే 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డు లో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం గురువారం కాంగ్రెస్ నేతలు  ప్రచారం నిర్వహించారు.  జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను  గెలిపిస్తే ఎల్లారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని గడపగడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుందని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తుందని ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు . ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ,  పిఎసిఎస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ , చెన్న లక్ష్మణ్, షేకావతలి, గఫర్, వినోద్ గౌడ్, నాగం సాయిబాబా, సొసైటీ డైరెక్టర్ గోపికృష్ణ, శంకర్ 11వ వార్డు ఇంచార్జ్ కిషన్,  బాలయ్య, రాములు, సాయిలు, కాశీరాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment