Home తాజా వార్తలు 5 శాతం రిబెటు తో మున్సిపాలిటీకి 34 లక్షల25 వేల ఆదాయం …ముగిసిన రిబేటు సౌకర్యం….- ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు

5 శాతం రిబెటు తో మున్సిపాలిటీకి 34 లక్షల25 వేల ఆదాయం …ముగిసిన రిబేటు సౌకర్యం….- ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మే 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులు 5 శాతం రిబెటుతో చెల్లించిన ఆస్థి పన్నులతో, మున్సిపాలిటీకి 34 లక్షల 25 వేల రూపాయల ఆదాయం వచ్చిందని , స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. బుధవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, 2024- 25 ఆర్థిక సంవత్స రానికి గాను, ఏప్రిల్ 1వ తేది నుంచి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో ప్రారంభమైన 100కు 5 శాతం ఆస్తి పన్ను రిబెటు వసూళ్ల స్పెషల్ డ్రైవ్ కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అన్ని వార్డుల్లో ఆయా వార్డు అధికారులు సిబ్బంది ఇంటింటికీ, వ్యాపార సంస్థల వద్దకు, దుఖాన యజమానుల వద్దకు తిరుగుతూ 5 శాతం రిబేటు సౌకర్యం గురించి వివరిస్తూ, ఇంటి యజమానుల నుంచి ఆస్థి పన్నులను ఏప్రిల్ 30 లోగా చెల్లించి, మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఆస్థి పన్నులను వసూలు చేయడం జరిగిందన్నారు. 30వ తేది మంగళవారంతో 5 శాతం రిబేట్ ఆస్థీ పన్ను వసూళ్ల స్పెషల్ డ్రైవ్ ముగిసిందని కమిషనర్ తెలిపారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మాసం రిబెటు ఆస్థి పన్నుల ఆదాయం దాదాపు గా 23 లక్షలు వచ్చిందని, 2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను 34 లక్షల 25 వేల రూపాయల ఆదాయం వచ్చిందని కమిషనర్ వివరించారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులు ఏప్రిల్ మాసంలో కల్పించే 5 శాతం రిబేటు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment