Home తాజా వార్తలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు అందేల చూడాలి…విద్యుత్ లైన్లను తనిఖీలు చేస్తూ మరమ్మత్తులు చేయాలి…విద్యుత్ శాఖ ఉద్యోగులు స్థానికంగా అందుబాటులో ఉండాలి…లింగంపేట్, పోతాయి పల్లి 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ…                                      కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్ బాబు

నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు అందేల చూడాలి…విద్యుత్ లైన్లను తనిఖీలు చేస్తూ మరమ్మత్తులు చేయాలి…విద్యుత్ శాఖ ఉద్యోగులు స్థానికంగా అందుబాటులో ఉండాలి…లింగంపేట్, పోతాయి పల్లి 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ…                                      కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్ బాబు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మే 1,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):గృహ, గృహేతర విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని , కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్ బాబు విద్యుత్ సిబ్బందికి ఆదేశించారు. బుధవారం ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ పరిధిలోని లింగంపేట్, పోతాయిపల్లి 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎస్ ఈ ఆకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదా లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో వెళ్ళి పరిశీలించారు. ఆతర్వాత ఎస్ ఈ రమేష్ బాబు విద్యుత్ ఉద్యోగులలో కలిసి మాట్లాడుతూ, వేసవి కాలం నేపథ్యంలో ఎప్పటి కప్పుడు విద్యుత్ లైన్లను తనిఖీలు చేస్తూ, అవసరమైన మరమ్మత్తులు చేస్తూ, అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. 24 గంటలు స్థానికంగా అందు బాటులో ఉండాలని సంబంధిత విద్యుత్ శాఖ ఉద్యోగులను ఆదేశించారు.
లింగంపేట్ , శెట్పల్లి సంగారెడ్డి సబ్ స్టేషన్ పరిధిలోని 11 కెవి ఫీడర్లలో 200 ఇంటర్మీడియట్ పోల్స్ లను ఏర్పాటుచేసి అంతరాయలు లేకుండా 11 కెవి విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్న సిబ్బంది పని తీరునిచూసి అభినందించారు. అలాగే మూడు 11 కేవీ లైన్ ఏ బి స్విచ్ లను ఏర్పాటు చేసి సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వేరొక ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు చేసిన ఏర్పాట్లను పరేశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత వేసవి కాలంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకో వాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్ బాబు వెంట ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ డి ఈ గణేష్ , ఏ డీ ఈ తిరుపతి రెడ్డి, ట్రాన్స్ కో ఏఈ లు సాయినాథ్, హరీష్, ఎన్.సత్య నారాయణ, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment