39
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసలు, ఆ వలసలు బీజేపీలో మొదలయ్యాయి. సోమవారం రాత్రి ఎమ్యెల్యే మదన్ మోహన్ సమక్షంలో లింగంపేట్ మండలం సజ్జనపల్లి గ్రామానికి చెందిన బీజేపీ యువకులు 30 మంది కాంగ్రెస్ లో చేరారు. గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన బీజేపీ యువకులు 30 మంది కాంగ్రెస్ లో చేరగా, వారికి ఎమ్యెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.