Home తాజా వార్తలు ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటాం…కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ ఆశీర్వదించండి…బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటాం…కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ ఆశీర్వదించండి…బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 29:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)అన్నదాతలకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని… ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సోమవారం జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ శేట్కర్ కు గెలిపించాలని కోరుతూ.. ఆయనకు మద్దతుగా ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ పరిధిలోని జాన్కంపల్లి కుర్దు నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభించారు. లక్ష్మాపూర్, హాజీపూర్ తండా , అడవి లింగాల్, కొక్కొండ, గండిమాసాని పేట్ తదితర గ్రామాలలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఐదు గ్యారంటీ లను అమలు చేశామని మహిళలకు పెద్దపీట వేషామన్నా
రు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, కరెంట్ జీరో బిల్లు, 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు పెంపు చేయడం జరిగిందన్నారు. 10 సంవత్సరాలలో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న బీబీ పార్టీ ఎల్లారెడ్డి నియోజక వర్గానికి చేసింది ఏమి లేదన్నారు. ప్రజలకు ఏమి చేసిండు ప్రతి ఇంటికి తెలపాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారంటీ లతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగు తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్షగా పనిచేస్తాయన్నారు. నాల్గవ విడత మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, జడ్పిటిసి ఉష గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment