Home తాజా వార్తలు పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించాము

పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించాము

by V.Rajendernath

జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

కామారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని యెన్.ఐ.సి. కేంద్రంలో జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల కమీషన్ రూపొందించిన ఆన్ లైన్ సాఫ్ట్ వెర్ ద్వారా 20 శాతం అదనంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ సిబ్బందితో 1,093 బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా నియోజకవర్గాలకు కేటాయించామన్నారు. అదేవిధంగా 30 శాతం అదనంగా మొదటి విడత 85 మంది మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా వర్చువల్ విధానంలో సంగారెడ్డిలో ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఉన్న ఎన్నికల సాధారణ పరిశిలకులు గోపాల్ జి తివారి సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని, వారు నిశితంగా పరిశిలించారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, దివ్యంగులచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలకు కూడా పోలింగ్ సిబ్బందిని కేటాయిచామని కలెక్టర్ తెలిపారు. 4,388 మంది పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, రెండవ విడత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని సాధారణ పరిశీలకులకు తెలిపారు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని, పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడిన ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఒ రాజారామ్, మ్యాన్ పవర్ నోడల్ అధికారి వరద రెడ్డి, రాష్ట్ర యెన్.ఐ.సి. అధికారి రవి, జిల యెన్.ఐ.సి అధికారి శ్రీకాంత్, కలెక్టరేట్ ఏ.ఓ. మసూర్ అహ్మద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment