కామారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకులు మోతిలాల్ షెటే (Mothilal shete-2014 batch) సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, అభ్యర్థుల వ్యయ నిర్వహణ, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టికల్ సర్వేలెన్స్ బృందాల పనితీరు, అక్రమ డబ్బు, మద్యం స్వాధీనం, కేసులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చును అకౌటింగ్ టీమ్ పక్కాగా నిర్వహించాలన్నారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి ఎలా లెక్కించాలి, రిజిస్టర్లల్లో ఎలా నమోదు చేయాలో అకౌంటింగ్ టీమ్ కు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.వీడియో సర్యేలెన్సు టీమ్ ఇచ్చే వీడియో ఫుటేజీ, ఎవిడెన్స్ ఆధారంగా ఖర్చును లెక్కించి జాగ్రత్తగా అభ్యర్థి షాడో రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టికల్ సర్వేలెన్స్ టీమ్ , ఏం.సి.ఏం.సి.తదితర అన్ని కమిటీలు నుండి సమాచారాన్ని సేకరించి వాటి ఆధారంగా ఖర్చును లెక్కిస్తూ రోజు వారి నివేదికలు సమర్పించాలని సూచించారు. అభ్యర్థి ఖర్చు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలన్నారు. అకౌంటింగ్ నిర్వహణలో ఏ అనుమానాలున్న వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. 10 లక్షల పైగా జరిగే అనుమానస్పద బ్యాంకు లావాదేవీలు, బహుమతుల తరలింపుపై నిఘా ఉంచాలన్నారు. కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రాల్లో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. నిఘాకు ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ టీములని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. సి-విజిల్, 1950 టోల్ ఫ్రీ ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కమిటీ ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారంపై పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రచారానికి ప్రకటనలు, పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా చూపాలన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు వివిధ బృందాలు, పోలీస్ శాఖ ద్వారా 72 మంది నుండి కోటి 38 లక్షల 68 వేల నగదును పట్టుకొని సరైన పత్రాలు చూయించిన 57 మందికి 72 లక్షలు తిరిగి అందజేశామని, 53 లక్షల నగదుపై ఆదాయపు పన్ను శాఖ వారికి అప్పగించామన్నారు. అదేవిధంగా పొలిసు, ఆబ్కారీ శాఖలు సంయుక్తంగా 55 లక్షల 57 వేల విలువ గల 40,123 లీటర్ల మద్యాన్ని, 40 వేల విలువ గల 143 కిలోల గంజాయి వంటి మత్తు పదార్థాలను పట్టుకున్నామని వ్యయ పరిశీలకులకు తెలిపారు. జిల్లాలో 913 పోలింగ్ కేంద్రాలకు గాను 64 సమస్యాత్మక లొకేషన్లు, 183 సమస్యాత్మక పోలింగ్ స్టేషనలను గుర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకునుంటామన్నారు. 516 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. వ్యయ నిర్వహణకు వ్యయ పరిశిలకులతో పాటు 34 అకౌంటింగ్ బృందాలు, వీడియో వీవింగ్,, వీడియో సర్వేలెన్స్, ఎఫ్.ఎస్.టి. ఎస్.ఎస్.టి బృందాలను, 94 మంది సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా పర్వయికేశీంస్తుండడంతో పాటు 1950 టోల్ ఫ్రీ నెంబరు, స్-విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నామని మోతిలాల్ కు వివరించారు.
ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ రెండు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు లతో పాటు, జిల్లా సరిహద్దు చెక్ పోస్టులపై గట్టి నిఘా పెట్టమని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో తగు బందోబస్తు ఏరిపాటు చేస్తున్నామని, ఆయుధ లైసెన్సులు కలిగిన 25 మంది పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఒకరిపై కేసు నమోదు చేశామని, అక్రమ డబ్బు,మద్యం పై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైనీ ఎస్పీ కాజల్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ రవీంద్ర రాజు, నోడల్ అధికారి అంబాజీ, ఆదాయపు పన్ను అధికారి మనోజ్ కుమార్, సీవాణిజ్య పన్నుల అధికారి శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి.. ఎన్నికల సాధారణ పరిశీలకులు మోతిలాల్ షెటే
37