69
కామారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లాకు శుక్రవారం వచ్చిన జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ వ్యయ పరిశీలకులు మోతిలాల్ షెటే, (ఐ.ఆర్.ఎస్. 2014)ను జిల్లా కలెక్టర్జితేష్ వి పాటిల్ , ఎస్పీ సింధు శర్మలు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, వ్యయ నిర్వహణ కమిటీ, సహాయ వ్యయ పరిశీలకుల నియామకం, వ్యయ మానిటరింగ్ చేస్తున్న తీరుపై వారికి వివరించారు.