ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా, శుక్రవారం సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరం పేట్ లో సాయంత్రం జరిగిన జన జాతర భారీ బహిరంగ సభకు రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజర య్యారు. సిఎం తో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి సురేష్ శేత్కార్, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఎమ్మెల్యే మదన్ మోహన్ లు హాజరయ్యారు. ఇట్టి భారీ బహిరంగ సభకు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్థానిక మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్ళారు. తరలిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైసాని ఈశ్వర్ గౌడ్, ఎంపిటిసి సంతోష్ మాజీ జడ్పీటిసి చినబాలి సామేల్, మాజీ ఎంపీటీసీ షకావత్ అలీ, నాయకులు సయ్యద్ గఫార్ , షేర్ల సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.