కామారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ప్రజాస్వామ్య ప్రతిష్టతకు ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటువేసేలా అవగాహన కలిగించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళా సమాఖ్య సంఘ సభ్యులకు సూచించారు. ఓటరు అవగాహాన కార్యక్రమంలో భాగంగా గురువారం స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమాఖ్య సభ్యులతో మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సరాసరి 80 శాతం ఓటు నమోదు కాగా పట్టణ ప్రాంతాలలో కేవలం 60 శాతం మాత్రమే నమోదవుతున్నదని అన్నారు. వంద శాతం ఓటింగ్ నమోదయితే ఫలితాలను ప్రభావితం చేస్తాయని, కాబట్టి పట్టణంలోని 1547 మహిళా సమాఖ్య సంఘాలు 16 వేల మంది సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహాన కలిగించి ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చైతన్యం తేవాలన్నారు. ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేసినవారవుతామని అన్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా తమ వెబ్ సైట్ లు పొందుపరుస్తుదని , ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. మే 13 హాలిడే కాదని ,ఓటు హక్కు వినియోగించుకొనుటకు ప్రభుత్వం కల్పించే వెసులుబాటని, ఇది ప్రతి ఒక్కరు గమనించి బద్ధకం వీడి ఓటు వేయాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని, కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే రాజ్యాంగం కల్పించినఓటు హక్కును తమ నైతిక బాధ్యత గా వినియోగించుకొని వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు.అనంతరం ఎలాంటి ప్రలోభాలకు లోగాక నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ సుజాత, పట్టాన మహిళా సమాఖ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య ప్రతిష్టతకు ఓట ప్రతి ఓటర్ ఓటువేసేలా అవగాహన కలిపించాలి… జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
69