Home తాజా వార్తలు ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ

ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ

by V.Rajendernath

కామారెడ్డి, ఏప్రిల్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో సైతం కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వస్తే నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయొచ్చన్నారు. అందుకె జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను గెలిపించాలన్నారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment