మిర్యాలగూడ ఏప్రిల్ 25:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న తిరునగరు భార్గవ్ కేసిఆర్ రోడ్ షో కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించడానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పలుసార్లు ఫోన్ ద్వారా సంప్రదించారని, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫోన్ ద్వారా ఆహ్వానించడం జరిగిందన్న విషయం వాస్తవం కాదా.. అని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగార్జున చారి, బాసాని గిరి, భీమ్లా నాయక్, జానీ, ఐల వెంకన్న, సాధినేని శ్రీనివాసరావు, ఇస్మాయిల్ (చోటు) చిట్టిపోలు వెంకటేశ్వర్లు, దినేష్ గయాస్, అంజన్ రాజు, విష్ణు లు ప్రశ్నించారు. గురువారం మిర్యాలగూడ పట్టణ బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పలుమార్లు ఫోన్ చేసినా ఫోన్ హిస్టరీ నే రుజువు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానించిన, నియోజకవర్గ స్థాయి సమావేశాలకు, నల్గొండలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశాలకు హాజరు కాలేదన్న విషయం అందరికి తెలిసిందే అన్నారు. తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ మార్పుపై చర్చలు చేయడం అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే అని వారన్నారు. అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడి అసత్య ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. కెసిఆర్ రోడ్ షోకు వచ్చిన జనాధారణ చూసి ఓర్వలేక ఇటువంటి అవకాశవాద ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్ సూచనతో ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి మిర్యాలగూడ పట్టణంలో అన్ని కార్యక్రమాలకు అనేకమంది పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలను దూరంగా ఉంచి, మీరే అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు తెలుసు అన్నారు. మీరు పార్టీ మారుతారు అన్నది వాస్తవం కాదా..? వాస్తవం కాకపోతే మీరు మీ అనుచరులు పలుమార్లు జానారెడ్డి ఇంటి వద్ద పడి గాపులు కాస్తున్న విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. మీ చేరికను పట్టణ కాంగ్రెస్ కమిటీ వారు వ్యతిరేకిస్తూ పేపర్ ప్రకటన ఇవ్వడం, తీర్మానాలు చేయడం, పత్రిక ప్రకటనలు ఇవ్వడం వాస్తవం కాదా..? భాస్కర్ రావు సహకారంతో రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ పదవులు, నీ అనుచరులు కౌన్సిలర్ పదవులు అనుభవించడం ప్రజలకు తెలుసు అన్నారు. మిర్యాలగూడలో అనేకమంది ఉద్యమకారులు ప్రతిభ కలిగిన నాయకులు ఉన్నప్పటికీ భాస్కరరావు మీకు ప్రత్యేకతను కల్పించి రెండు కీలకమైన పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. అధికారం కోసం పార్టీలు మారుతూ అసత్య ప్రచారాలు మాను కోవాలన్నారు. మీరు బిఆర్ఎస్ పార్టీను ఉపయోగించుకున్నారు అనేది ప్రజల అభిప్రాయం రాజకీయ ప్రాధాన్యత లేని ప్రజలను అడిగిన మాజీ శాసనసభ్యులు నలమోతు భాస్కర్ రావు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినారో తెలుసుకొని, ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు కలసి రావలసిందిగా కోరుతున్నామన్నారు.
అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు మీ అనుచరులు జానారెడ్డి ఇంటి వద్ద పడి కాపులు కాస్తున్న విషయం వాస్తవం కాదా..?
159
previous post